JN: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొడకండ్ల మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. కాంగ్రెస్ బూటకపు మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.