JGN: పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశం స్వాతంత్ర్యం సాధించడంలో మహాత్మా గాంధీ గారి పాత్ర అపూర్వమైందని, ఆయన అహింసా సిద్ధాంతం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమైందని పేర్కొన్నారు.