ATP: శరన్నవరాత్రుల సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి చల్లని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.