CTR: దసరా మహోత్సవాల్లో భాగంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయాన్నే అమ్మవారి మూలవిరాట్ను ఆలయ అర్చకులు అభిషేకించారు. అనంతరం అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించి విశేష పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.