NDL: బండి ఆత్మకూరు మండలంలో 2024-25లో చేపట్టిన ఉపాధి హామీ పనులపై 19వ విడత సామాజిక తనిఖీ జరిగింది. ఎంపీడీవో గాయత్రి ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అధికారి పరమేశ్వరుడు, తనిఖీ బృందం పాల్గొన్నారు. మండలంలో రూ.10.15 కోట్ల పనులు చేశారని చెప్పారు. రికవరీ రూపంలో రూ.13,262, పెనాల్టీ రూపంలో రూ.21వేల రికవరీకి ఆదేశించారు.