అన్నమయ్య: నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోడూరు టీడీపీ ఇంఛార్జ్ ముక్కారూపానంద రెడ్డి తెలిపారు. గురువారం కోడూరు పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహించిన జాబ్ మేళాకు యువత భారీగా తరలివచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.