PLD: బొల్లాపల్లి మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది భాస్కర్ రావు, కొండలు, సంజన భాయ్ పాల్గొని మాట్లాడుతూ.. పశువులకు సకాలంలో టీకాలు వేయించుకుని వ్యాధులు నుంచి రక్షించుకోవాలని రైతులకు సూచించారు.