JGL: జిల్లాలో మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు పలువురు రైతులు వినతిపత్రం సమర్పించారు. ఖరీఫ్లో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కలకి జగిత్యాలకి చెందిన 300పైగా రైతుల 6000క్వింటాల్ల మక్కల డబ్బులు బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. రబీకి చెందిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తానన్నారు.