MNCL: భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీని MPDO మధుసూదన్ బుధవారం సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి, నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో APO జీనత్, హౌసింగ్ AE రుచిత, పంచాయతీ కార్యదర్శి వసుంధర తదితరులు పాల్గొన్నారు.