TG: గణేశ్ నిమజ్జన వేడుకల వేళ.. ప్రజలకు CM రేవంత్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. ‘గల్లీ గల్లీలో, పల్లె పల్లెలో 11 రోజులుగా కోట్లాది మంది భక్త జనుల పూజలు అందుకుని.. ప్రజలకు ఆశీస్సులు అందించి.. తిరిగి ప్రకృతి ఒడిలో చేరుతున్న గణేశుడికి ఘనంగా వీడ్కోలు పలుకుదాం. భక్తి శ్రద్ధలతో, జాగ్రత్తలతో ప్రజలు నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని పోస్టు చేశారు.