HYD: తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ కవితపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు, కార్యకర్తలు తన కార్యాలయం, తనపై దాడి చేశారంటూ మల్లన్న ఫిర్యాదు చేశారు. సుమారు 50 మంది ఆమె అనుచరులు మారణాయుధాలతో తనపై దాడి చేసి హత్యాయత్నానికి యత్నించారని పేర్కొన్నారు. బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలన్నారు.