ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో శనివారం ఏర్పాటుచేసిన కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పెళ్లయిన మహిళలకు తులం బంగారం ఇస్తామన్న హామీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో మహిళలు మోసపోయారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.