JGL: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో శనివారం వ్యవసాయ అధికారి రాజ్కుమార్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలో ఉన్న ఎరువుల వివరాలు, బిల్బుక్స్, రిజిస్టర్, ఈపాస్ మిషన్లో అమ్మకాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎరువుల అమ్మకాలు ఈ పాస్ ద్వారా మాత్రమే చేపట్టాలని, రైతులు కూడా తమకు అవసరం ఉన్నంతవరకే యూరియా కొనుగోలు చేయాలని సుచించారు.