KMM: అశ్వాపురం మండలంలో ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల దోపిడిని నియంత్రించాలి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఈఓకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలు, బుక్ స్టాల్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.