GNTR: టీడీపీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్ని ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలు స్థానిక స్థాయిలోనే త్వరగా పరిష్కారం అవ్వాలని అధికారులను ఆదేశించారు.