ELR: చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని(SWPC) జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీహరి శనివారం పరిశీలించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న చెత్త పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. గ్రామ సర్పంచ్ రాందే లక్ష్మీ సునీత రాజారావు, ఉంగుటూరు ఎంపీడీవో జిఆర్ మనోజ్, డిప్యూటీ ఎంపీడీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.