NLR: గుడ్లూరు మండలం రావూరు గ్రామంలో గ్రామసభ జరగగా జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పారిశ్రామిక అభివృద్ధి కోసం భూములు ఇచ్చే ప్రతి రైతుకు న్యాయం చేస్తామని, ఈ ప్రాంతం యువతకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చే పరిహారాన్నిపెంచి అండగా ఉంటామని చేప్పారు.