RR: మొయినాబాద్ మండలం తొల్కట్ట గ్రామంలో సర్వే నెం.155లో 1-14 గుంటల ప్రభుత్వ భూమిలో కబ్జాను రెవెన్యూ అధికారులు తొలగించి, సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కె. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గిర్దవర్ రాజేష్, రెవెన్యూ సిబ్బంది భాస్కర్, భరత్, అంజయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.