అనంతపురం: ఎస్పీ జగదీశ్ని ఆపరేషన్ సింధూర్ జవాన్ పొలిమేర రమాకాంత్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడిపత్రి మండలం చుక్కలూరుకు చెందిన ఆయన పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాల్గొన్నారు. సెలవుపై స్వగ్రామానికి రావడంతో తన సోదరుడు మురళీమోహన్ రెడ్డితో కలిసి ఎస్పీని కలిశారు. జవాన్ను ఎస్పీ అభినందించారు.