BPT: సంతమాగులూరులోని పాతమాగులూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి అనంతపురంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన హుస్సేన్గా పోలీసుల గుర్తించారు. రహదారి వెంబడి పార్క్ చేసిన లారీని శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.