MHBD: ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు ఉడుముల పద్మజ, కంది జయ భరత్ రెడ్డి, రమణారెడ్డి, స్నేహ, సంయుక్తా రెడ్డి శ్రీ సాయిబాబా ఆలయ అభివృద్ధికి రూ.50 వేలు విరాళం అందజేశారు. గురువారం ఈ విరాళాన్ని ఆలయ అర్చకుడు అంబడిపూడి ప్రసాద్ శర్మకు కమిటీ సభ్యులు అందజేశారు. గ్రామస్తులు ఆలయ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.