SKLM: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు విశాఖపట్నంలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం నరసన్నపేట మండల స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో నియోజవర్గ స్థాయి అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21న నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.