NRML: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంపై గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ ఇంఛార్జ్ ఆర్ఐ సంతోష్, కాంట్రాక్ట్ బిల్ కలెక్టర్ షోయబ్ రూ. 6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు వీరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.