సత్యసాయి: ధర్మవరం నియోజవర్గంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ రేపు పర్యటించనున్నారు. ఉదయం 6:30 గంటలకు మడుగుతేరు రథోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఎన్డీఏ కార్యాలయంలో ప్రజలతో సమావేశం అవుతారు. రాత్రి 7 గంటలకు అనంతపురం బయలుదేరి వెళ్తారని మంత్రి కార్యాలయ సిబ్బంది వెల్లడించారు.