కడప: గత వైసీపీ పాలనలో నిధుల లేమితో అసంపూర్తిగా వదిలేసిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక ఉప కేంద్రాలు 387 ఉన్నాయి. వాటికి అంచనా వ్యయాన్ని పెంచాలని వైసీపీ నాయకులు, గుత్తేదారులు ఒత్తిడి చేయడంతో రూ.17.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అయినప్పటికీ పనులు జరగలేదని ప్రజలు మండిపడుతున్నారు.