ATP: తాడిపత్రికి చెందిన 12ఏళ్ల బాలిక వర్ణిక నిజాయితీ చాటుకున్నారు. పట్టణంలోని మెయిన్ బజార్ యూనియన్ బ్యాంక్ ATM వద్ద భాస్కర్ నాయక్ అనే వ్యక్తి డబ్బులు డ్రా చేశారు. ఆ సమయంలో డబ్బులు రాకపోవడంతో వెళ్లిపోయాడు. పది నిమిషాల తర్వాత అదే ఏటీఎంలోకి వెళ్లిన వర్ణిక 9వేలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి నగదును CI సాయి ప్రసాద్కు అందజేశారు.