ATP: తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని ఆసుపత్రి పాలెంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పలు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కాలనీలో ఏ సమస్యలున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.