BPT: చీరాల ఎన్ఆర్&ఎంపీ స్కూల్లో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ శుక్రవారం ఫ్లడ్ లైట్ల వెలుగులో హోరాహోరీగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 20 ఫుట్బాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు.