VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు కంటికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన బుధవారం రాజాంలోని కళా వెంకటరావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శ అల్లాడ భాస్కరరావు ఉన్నారు.