బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కించనున్న వెబ్ సిరీస్లో ఆమె ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. మహిళా ప్రాధాన్య కథతో తెరకెక్కనున్న ఈ సిరీస్ షూటింగ్.. జూలైలో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఇందులో మహిళల అణచివేత, సామాజిక సమస్యలే ప్రధాన కథాంశంగా ఉండనున్నాయట.