కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో వారం వారం నిర్వహించే ఉద్యోగమేళాలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు రామచంద్రపురం ఉపాధి భవనంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. టెన్త్ నుంచి ఆ పైన చదివిన వారందరినీ అర్హులుగా ప్రకటించింది.