ADB: ఉట్నూర్ మండలంలోని బీర్సాయిపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని స్థానికులు తెలిపారు. సోమవారం ఓ కారు బీర్సాయిపేట శివారులోని ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను ఉట్నూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.