ప్రకాశం: నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంగమాంబ అమ్మవారి జాతరను పురస్కరించుకొని నరవాడకు నేటి నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ డి.శ్రీనివాసులు తెలిపారు. ఒంగోలు పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు ఈ బస్సు సర్వీసులను వినియోగించుకొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.