ATP: జిల్లాలో గంజాయి వినియోగదారులను గుర్తించేందుకు సమన్వయంతో పని చేయాలని అదనపు ఎస్పీ డి.వి. రమణమూర్తి సూచించారు. ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో వివిధ శాఖలతో సమావేశమయ్యారు. డోర్ టు డోర్ సర్వే చేయాలని నిర్ణయించారు. 1972 టోల్ ఫ్రీ నంబర్ను విడుదల చేశారు. విద్యాశాఖ, జైలు, డ్రగ్స్, ఎక్సైజ్, NGOలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.