NDL: శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అడవిలో శైలేశ్వరం జాతర, ఆదివారం సెలవు కావడంతో క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థమై బారులు తీరారు. ఉచిత దర్శనానికి 5 గంటలు, టికెట్ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండడంతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.