MNCL: అట్టడుగు వర్గాల్లోని ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే,సావిత్రి బాయి ఫూలే దంపతులని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.