ADB: బోథ్ మండలంలోని దన్నూరు గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. దన్నూరు గ్రామస్తులు మార్చి 30న తమ ప్రాంతంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్తో మాట్లాడి సమస్యను వివరించడం జరిగిందని అనిల్ జాదవ్ తెలిపారు. రైతుల సౌకర్యార్థం శుక్రవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.