AP: వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్తోపాటు 10 మంది నిందితులు సీఐడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు గంటపాటు జోగి రమేష్ను విచారించారు. విచారణ ముగిసిన తర్వాత జోగి రమేష్ మాట్లాడారు. చంద్రబాబు ఇంటికి నిరసన తెలియజేయడానికి మాత్రమే వెళ్లానని, ఈ విషయం చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలని సూచించారు.