KRNL: జిల్లాలో 672 వార్డు, గ్రామ సచివాలయాలు ఉండగా.. నేటి నుంచి 31 కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు జడ్పీ సీఈవో నాసరరెడ్డి తెలిపారు. జిల్లాలో 134 సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ కేంద్రాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆధార్ నమోదుకు ప్రజల తాకిడి ఎక్కువ అయినందున ఆధార్ కేంద్రాలను పెంచినట్లు స్పష్టం చేశారు.