కోనసీమ: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కలెక్టరేట్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహిస్తామని జేసీ నిశాంతి తెలిపారు. జిల్లాలో రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ విషయాలకు సంబంధించి ఫిర్యాదులను కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో పరిష్కరిస్తామన్నారు.