PLD: అప్పులు బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్దుర్తి మండలం మిట్టమీద పల్లె గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన కోటేశ్వరరావు (43) పది ఎకరాల్లో మిర్చి పంటను సాగుచేశాడు. మొత్తం సుమారు రూ.30లక్షలు అప్పు అవటంతో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మనోవేదనకు గురై గ్రామ సమీపంలోని కుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.