ADB: పట్టణంలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బంజారుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని గజేందర్ పేర్కొన్నారు.