NRML: నిర్మల్ మండలంలోని కొండాపూర్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ హరితహారంతో రాష్ట్రాన్ని పచ్చదనంగా అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్కు దక్కుతుందని అన్నారు.