KMR: యువజన కాంగ్రెస్ జిల్లా,నియోజకవర్గ అధ్యక్షులకు 3రోజులు శంషాబాద్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యువ క్రాంతి బునియాద్’కు ఢిల్లీ నుంచి వచ్చిన బృందం నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణలో KMR జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, జుక్కల్, బాన్సువాడ అధ్యక్షులు ఇమ్రోజ్, మన్సూర్ పాల్గొన్నారు.