ELR: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు నేతలు ఆదివారం ద్వారకా తిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలో అయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావులు నివాళులర్పించారు.