CTR: మార్చి 15న నగరంలోని ప్రముఖ పొన్నియమ్మన్ ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సీకే లావణ్య బాబు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 15, 16, 17 తేదీల్లో కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు.