కృష్ణ: వల్లభనేని వంశీ అరెస్టుపై హోంమంత్రి శుక్రవారం స్పందించారు. కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలి పెట్టదని.. తప్పు చేసినవారికి శిక్ష తప్పదని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. విజయవాడలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన వారిని డీజీపీ కార్యాలయాన్ని కూడా ముట్టుకోనిచ్చేవారు కాదన్నారు.