NDL: కల్లూరు అర్బన్ 19వ వార్డు ఇంజనీర్స్ కాలనీలో అభివృద్ధి పనుల్లో భాగంగా గురువారం సీసీరోడ్ల నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమం జరిగింది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని, పనులను ప్రారంభించారు. మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి పాల్గొన్నారు.