కోనసీమ: మండల కేంద్రం అయిన రావులపాలెం జాతీయ రహదారిపై విందు రెష్టారెంట్ ఎదురుగా గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని అరటి రైతు తన మోటార్ సైకిల్తో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.