SKLM: ఈనెల 23న జరగనున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి జె. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని ఐక్యవేదిక కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడానికి ఐదు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.